సంగారెడ్డిలో మెడికో అనుమానాస్పద మృతి..అచ్చం ప్రీతి ఘటనే !

-

Medico Rachna Reddy : తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. మెడికో రచనా రెడ్డి అనుమానాస్పద మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళా మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి. ఖమ్మం జిల్లా మమత మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి (25) ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తుంది.

Suspicious death of Medico Rachna Reddy

అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ORR (ఔటర్ రింగ్ రోడ్డు)పై కారులో అపస్మారక సిత్థిలో ఉండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు.
పోలీసులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మెడికో రచనా రెడ్డి ప్రాణాలు వదిలింది. మెడికో రచనా రెడ్డి మత్తు ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మెడికో రచనా రెడ్డి అనుమానాస్పద మృతి సంఘటన అచ్చం ప్రీతి సంఘటన తరహాలోనే ఉంది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news