ఈసారి వర్షాలు బాగా కురుస్తాయి.. కానీ జాగ్రత్త అవసరం – స్వర్ణలత

-

ఈసారి వర్షాలు బాగా కురుస్తాయి.. కానీ జాగ్రత్త అవసరం అన్నారు స్వర్ణలత. సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మహంకాళి అమ్మవారి ఆలయంలో ఇవాళ రంగం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బోనాల వేడుకల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించడం ప్రతిఏటా ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకున్నా, గతేడాది ఇచ్చిన వాగ్దానం మరిచారు, కావాల్సినంత బలాన్ని ఇచ్చాను, మీతోనే ఉంటానన్నారు స్వర్ణలత. ఈ సారి వర్షాలు కురుస్తాయి కానీ జాగ్రత్త అవసరం, అగ్నిప్రమాదాలు జరుగుతాయి, ఐదు వారాలు నాకు సాక పోయండని చెప్పారు స్వర్ణలత.

Read more RELATED
Recommended to you

Latest news