ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దు – తలసాని

-

ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..అత్యవసరమైతేనే ఇండ్లలో నుండి బయటకు రావాలని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

GHMC కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి నగరంలో ని పరిస్థితులు, సహాయక చర్యల గురించి ఆరా తీసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…హుస్సేన్ సాగర్ రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.

అన్ని స్థాయిలలోని అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. అత్యవసర సేవల కోసం GHMC కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని ఆదేశించారు. రానున్న2, 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందని.. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందించేందుకు సంసిద్ధం గా ఉందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news