రూ.2,00,000 రుణమాఫీపై తమిళి సై కీలక ప్రకటన

-

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక ప్రకటన చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రూ. 2,00,000 రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఉద్యోగాల భర్తీపై యువత ఎలాంటి అపోహలకు గురికావోద్దని సూచించారు.

అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలన సాగుతోంది. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. ఉద్యోగాల భర్తీపై ఎలాంటి అపోహలకూ యువత లోను కావొద్దు. దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలు కుదుర్చుకున్న సీఎంను, ఆయన బృందాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version