రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందింది – గవర్నర్‌ వివాదస్పద వ్యాఖ్యలు

-

రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందింది.. ప్రజా పాలన మొదలైందంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై. ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళుతోంది.. బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలన్నారు. పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని వెల్లడించారు.

నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేఛ్ఛా వాయువులు పీల్చుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వ పాలనా పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందింది.. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు వచ్చిందన్నారు గవర్నర్ తమిళిసై.

Read more RELATED
Recommended to you

Exit mobile version