రాష్ట్రంలో నేటి నుంచి 10 రోజుల పాటు మాజీ గవర్నర్ తమిళిసై ప్రచారం

-

తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఫుల్ స్వింగ్లో సాగుతోంది. అభ్యర్థుల ప్రచారాలు.. వారికి మద్దతుగా పార్టీల కీలక నేతల సభలు.. విమర్శలు.. ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. రోజుకో అంశం తెరపైకి వస్తూ రాజకీయ కాక పుట్టిస్తోంది. ముఖ్యంగా బీజేపీ.. ప్రచారంలో దూసుకెళ్తోంది. పార్టీ జాతీయ నేతలు రాష్ట్రంలో తిష్టవేసి ప్రచారాన్ని పరిగెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ.. అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో రెండంకెల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు రాష్ట్రానికి రానున్న తమిళిసై.. పది రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. రోజుకో అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆమె కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. చెన్నై సౌత్ లోక్సభ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news