బీజేపీ అధ్యక్షుడి మార్పుపై తరుణ్ చుగ్ క్లారిటీ

-

కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తొలగించబోతుందని పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ నీ తప్పించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టి.. బండి సంజయ్ కి కేంద్రమంత్రి పదవిని అప్పజెప్పబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది.

అయితే ఈ రూమర్స్ పై తాజాగా బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారం అని ఆయన కొట్టిపడేశారు. ఇటువంటి సమయంలో అధ్యక్షుడి మార్పు ఉండదని స్పష్టం చేశారు. బండి సంజయ్ నేతృత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళుతుందని స్పష్టం చేశారు. ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news