తెలంగాణ అర్చక ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ ఎనిమిది లక్షలకు పెంచేసింది. దీంతో దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చకులు అలాగే ఉద్యోగులకు రిలీఫ్ దక్కింది. మొన్నటి వరకు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అర్చకులు అలాగే ఉద్యోగులకు నాలుగు లక్షల వరకు గ్రాట్యూటీ ఉండేది.

అయితే ఆ నాలుగు లక్షల అమౌంట్ను ఎనిమిది లక్షలకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 13700 మంది అర్చకులు అలాగే ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు. మరోవైపు అర్చక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ మంత్రి కొండా సురేఖ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు అంతిమ సంస్కారాల ఖర్చులకు ఇచ్చే 200 రూపాయలను 30 వేల రూపాయలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు కొండా సురేఖ.