హైదరాబాద్​లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీ ప్రముఖులు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఉదయమైతే రద్దీ తక్కువగా ఉంటుందని సినీ రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. హైదరాబాద్​లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ క్లబ్‌లో భార్యతో కలిసి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ తన సతీమణి ప్రణతి, తల్లితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో నటుడు సుమంత్ ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో కీరవాణి ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. వీరితో పాటు రాజకీయ ప్రముఖులైన ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌లో ఓటు వేశారు. తన తండ్రి, కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అంబర్​పేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలంతా తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news