నేడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతల సమావేశం

-

హైదరాబాద్‌లో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జ్‌లు పాల్గొననున్నారు. వారితో పాటు తరుణ్‌చుగ్, సునిల్ బన్సల్, ప్రకాశ్‌ జావడేకర్‌, లక్షణ్‌, డీకే అరుణ హాజరవనున్నారు. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికతోపాటు ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఎన్నికల కార్యాచరణపై జిల్లాల అధ్యక్షులు, ఇన్‌ఛార్జులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంలో మేరీ మాటి- మేరా దేశ్‌ కార్యక్రమంపై నేతలు సమీక్షించనున్నారు. మరోవైపు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చ జరగనున్నట్లు తెలిసిందే. ఎమ్మెల్యే ప్రవాస్ యోజన ఏ విధంగా జరిగిందనే దానిపై సమీక్ష.. దాంతో పాటు త్వరలో జరగబోయే పార్టీ వాహన యాత్ర ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నారు. ఇంకోవైపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలపై చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version