తెలంగాణలో బోనాల పండుగ జాతర త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఆషాడ మాసంలో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల పండుగ జూన్ 26వ తేదీన ప్రారంభమవుతున్నాయి. హైదరాబాద్ లోని గోల్కొండలో అమ్మవారికి జూన్ 26న బోనం సమర్పిస్తారు. జూన్ 29వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. జూలై 2వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. జూలై 4న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించనున్నారు. జులై 10న ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు.

జూలై 14న రంగం, అమ్మవారి ఘటం ఊరేగింపు కార్యక్రమాలను కొనసాగిస్తారు. జూలై 15న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం అందిస్తారు. జూలై 20న పాతబస్తీ, లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతరను ప్రారంభిస్తారు. జులై 21న ఘటాల ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. జూలై 21వ బోనాల పండుగ కార్యక్రమం ముగుస్తుంది. దీంతో తెలంగాణలోని వాసులు బోనాల పండుగ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి బోనాల ఊరేగింపు చేయాలని ఆసక్తిగా ఉన్నారు. అమ్మవారికి బోనాల సమర్పిస్తే వారి ఇంట్లో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు.