Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… రేపటి నుంచి రైతు భరోసా నిధులు జమ

-

Rythu Bharosa:  తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అందింది. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నర్సింగ్ కాలేజీల్లో జపనీస్ భాషను ఆప్షనల్‌గా చేర్చాలని పేర్కొన్నారు. జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి మంచి డిమాండ్ ఉందన్నారు.

telangana rythu bharosa
telangana rythu bharosa

తెలంగాణ రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పనిచేయాలని తెలిపారు. ప్రతీ నెలా మూడో వారంలో విద్య, వైద్యంపై సమీక్ష నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. అటు సెర్ప్ ఆవిర్భవించి 25 ఏళ్లయిన సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. 25 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు కార్యక్రమం ప్రారంభించాను.. గ్రామీణ మహిళల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధే ప్రాజెక్టు లక్ష్యం అన్నారు. కాలక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థగా మారిందని తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలనకు సెర్ప్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news