BREAKING : హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దావోస్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కాంగ్రెస్ శ్రేణులు.. స్వాగతం పలికాయి.

Switzerland

కాగా, సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈనెల 25న ఎల్బీ స్టేడియంలో భారీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి హాజరై 44 వేల మంది పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సభ అనంతరం సీఎం రేవంత్ జిల్లాల్లో పర్యటిస్తారని సమాచారం. మంత్రులు కూడా తమకు అప్పగించిన నియోజకవర్గాలకు వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news