Telangana: ఆర్టీసీ బస్సుకు అడ్డంగా ముళ్ళ కంచె వేసి..అడ్డుకున్న రైతులు

-

Telangana: ఆర్టీసీ బస్సుకు అడ్డంగా ముళ్ళ కంచె వేసి..అడ్డుకున్నారు రైతులు. ఈ సంఘటన యాదాద్రిలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలోని ఐకేపీ కొనుగోలు సెంటర్లో గత వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

telangana farmers protest in yadadri

అధికారుల నిర్లక్ష్యంతో అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు జరిపేంత వరకు ధర్నా విరమించేది లేదంటూ, చౌటుప్పల్ నుంచి జూలూర్ రహదారిపై కంప చెట్లు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news