తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రూ.1000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

-

Telangana : తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా 21.35 లక్షల మంది రైతుల 11 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది కేసీఆర్ సర్కార్. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ఆయా రైతుల ఖాతాలలో జమ చేసింది.

Telangana Government has released Rs.1000 crores

తద్వారా మెజారిటీ రైతులకు రుణమాఫీని పూర్తి చేసింది. అలాగే బుధవారం రుణమాఫీ కోసం మరో వెయ్యి కోట్లు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీని తర్వాత ప్రక్రియ మరింత వేగం కానుంది. రెండో విడత రుణమాఫీని ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 29 లక్షల మంది రైతుల కు సంబంధించిన 19 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోండి. ఇందులో భాగంగానే వరుసగా రుణమాఫీ చేసుకుంటూ వస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version