తెలంగాణ ప్రజలకు సీఎం, గవర్నర్ హోలీ శుభాకాంక్షలు

-

దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఆదివారం నుంచే పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు షురూ అయ్యాయి. ప్రజలంతా కోలాహలంగా చిన్నా పెద్దా కలిసి ఈ సంబురాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు. హోలీ రంగులు అందరి మధ్య ఐక్యతను బలపరిచే పవిత్ర బంధమని, ఈ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని గవర్నర్ అన్నారు.

ప్రజా పాలనలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్తవర్ణ రంగుల శోభను నింపుతాయని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జ‌రుపుకునే హోలీ పండుగను రాష్ట్ర ప్రజలు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతీమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news