మోడీ వల్లే… టీమిండియా ఈజీగా గెలుస్తోంది – తెలంగాణ గవర్నర్

-

మోడీ వల్లే… టీమిండియా ఈజీగా గెలుస్తోందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా మరోసారి తన సత్తాను చాటింది. శ్రీలంక జట్టుపై ఏకంగా 302 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ముంబైలోని వంఖాడే వేదికగా ఈ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి నేరుగా సెమిస్ కు చేరింది టీమిండియా జట్టు.

Telangana Governor Tamilisai comments on team india

ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా… నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, గిల్ చాలా బాగా రాణించారు. అయితే ఈ ముగ్గురు ఈ మ్యాచ్ లో సెంచరీ మిస్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలో 55 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో 302 పరుగులతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.అయితే ఈ విజయంపై తెలంగాణ గవర్నర్ తమిళ్ సై స్పందించారు. వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఇండియా టీం ఇంత ఈజీగా గెలుస్తుంది అంటే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళ్ సై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో… ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news