ప్రమాదంలో గాయపడిన యువకుడు.. చికిత్స చేసిన గవర్నర్ తమిళిసై

-

స్వతహాగా డాక్టర్ అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్భం వచ్చిన ప్రతిసారి తానొక వైద్యురాలిననే విషయం గుర్తు చేస్తుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటనలో గవర్నర్ తమిళిసై మానవత్వాన్ని చాటుకున్నారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా చెన్నై సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విషయం గమనించి కారును ఆపిన గవర్నర్ అతనికి ప్రాథమిక చికిత్స అందించారు.

అనంతరం అంబులెన్స్‌ను అక్కడికి పిలిపించారు. ఆస్పత్రి వారితో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై హైదరాబాద్‌కు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వారిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించగలిగితే ప్రాణాలు నిలబెట్టిన వారమవుతామని గవర్నర్‌ అన్నారు. అదే విధంగా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మితి మీరిన వేగం మన ప్రాణాలకే కాదు ఎదుటి వారి ప్రాణాలకు కూడా ముప్పేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version