ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

-

తెలంగాణలో ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్. లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడున్నరేళ్లుగా ఎంతో మంది ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వారి ఎదురుచూపులకు రేవంత్ సర్కార్ తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది.

ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31వ తేదీలోగా మొత్తం రుసుం చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్‌లను క్రమబద్ధీకరించనున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు.

నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా.. క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో డిప్యటీ సీఎం ఎల్‌ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news