విధి నిర్వహణలో ప్రతిభకనబర్చిన పోలీసులకు ప్రభుత్వ పతకాలు

-

విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా విభాగాల్లోని పలువురు అధికారులు పతకాలు దక్కించుకున్నారు. సాధారణ విభాగంలో ఒకరికి శౌర్య పతకం, 9 మందికి మహోన్నత సేవ పతకాలు, 89 మందికి ఉత్తమ సేవ పతకాలు, 42 మందికి కఠిన సేవ పతకాలు, 435 మందికి సేవ పతకాలను సర్కార్ ప్రకటించింది.

మరోవైపు అవినీతి నిరోధక శాఖలో ఐదుగురికి ఉత్తమ సేవ, ముగ్గురికి సేవ పతకాలు ప్రకటించిన సర్కార్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో ముగ్గురికి ఉత్తమ సేవ, ఏడుగురికి సేవ పతకాలు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ లో ఆరుగురికి శౌర్య పతకాలు, ముగ్గురికి ఉత్తమ సేవ, 13 మంది సేవ పతకాలు దక్కించుకున్నారు. టీఎస్ఎస్పీలో ఒకరికి మహోన్నత పతకం, నలుగురికి ఉత్తమ సేవ పతకం, 15 మందికి సేవా పతకాలు ప్రకటించిన ప్రభుత్వం.. వారికి అభినందనలు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version