జూనియర్‌ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించండి : హైకోర్టు

-

ఇంటర్‌ కాలేజీల్లో అతిథి అధ్యాపకుల కొనసాగింపుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గత విద్యా సంవత్సరాల్లో నియమితులైన గెస్ట్‌ ఫ్యాకల్టీని కొనసాగించాలని ఆదేశించింది.

జూనియర్‌ కాలేజీల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి ఈనెల 18వ తేదీన ఇంటర్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో అతిథి అధ్యాపకులు పిటిషన్‌ దాఖలు చేశారు. తాజా నియామకాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం..  ఫిర్యాదులు లేని, అర్హులైన గెస్ట్‌ ఫ్యాకల్టీని ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఇంటర్‌ కమిషనరేట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 21కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version