నేటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

-

తెలంగాణ ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇలాంటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతాయని అధికారులు ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం 9 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్ష కొనసాగుతుంది.

Telangana Inter Supplementary Exams from today
Telangana Inter Supplementary Exams from today

ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక విద్యార్థులు ఎగ్జామ్స్ సెంటర్లకు అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సప్లమెంటరీ పరీక్షలు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇక జూన్ మూడో తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news