తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

-

తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు…. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం రెండున్నర నుంచి 5.30 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. రాష్ట వ్యాప్తంగా 933 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు 2 లక్షల 70 వేల 583 మంది.. రెండో సంవత్సరం లక్ష 41 వేల 742 మంది….. మొత్తం కలిపి 4 లక్షల 12 వేల 325 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. మాల్ ప్రాక్టీస్ వంటి అక్రమాలకు పాల్పడినతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు తెలిపింది. వేగంగా మూల్యాంకనం పూర్తి చేసి వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తులు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version