స్పెషల్‌ హెలికాప్టర్‌ లో పొంగులేటి ఇంటికి తెలంగాణ మంత్రులు !

-

స్పెషల్‌ హెలికాప్టర్‌ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి తెలంగాణ మంత్రులు పయనం అయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం పర్యటనకు బయలుదేరారు.

Telangana ministers to Ponguleti’s house in a special helicopter

భద్రాచలంలోని సీతారామచంద్రస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో జరిగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news