డ్రగ్స్ సరఫరా… ఏపీ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

-

పేరుకే పోలీస్.. కానీ చేసేదేమో డ్రగ్స్ దందా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. బాపట్ల నుంచి హైదరాబాద్‌కు రూ.2 కోట్ల విలువ గల డ్రగ్స్‌ను తరలించారు ఏపీ కానిస్టేబుల్. ఈ విషయం తెలిసి.. ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు సైబరాబాద్ SOT పోలీసులు.

Telangana Police arrests AP constable supplying drugs in Telangana
Telangana Police arrests AP constable supplying drugs in Telangana

కానిస్టేబుల్ నుంచి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆ కానిస్టేబుల్‌ని తిరుపతికి చెందిన గుణశేఖర్‌గా (40) గుర్తించారు SOT పోలీసులు. మిగిలిన 5గురు సురేంద్ర(31), హరిబాబు (38), మార్గరేట్(34), మస్తాన్వలీ(40), దేవరాజు(29)గా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news