రేవంత్ సర్కార్ మరో బాంబ్ పేల్చినట్లు వార్తలు వస్తున్నాయి. GHMC పరిధిలోని ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందే.. లేదంటే ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు వార్నింగ్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. GHMC చట్టంలోని సెక్షన్ 212(2) మేరకు.. వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్టీ) చెల్లించాల్సిందే అని పేర్కొంటున్నారట.

మార్కెట్ రేట్లో.. 0.05 శాతం వరకు వీఎల్టీ చెల్లించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు అధికారులు. వీఎల్టీ వసూలైతే.. రూ.110 కోట్ల మేర డబ్బులు GHMC ఖజానాకు చేరతాయని అంచనా వేస్తున్నారట. ఒకవేళ వీఎల్టీ చెల్లించకపోతే.. ఆయా ప్లాట్లలో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే.. ఇటువంటి మార్గాలను అన్వేషిస్తున్నారట. అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.