దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ గా నిలిచింది: డీజీపీ మహేందర్ రెడ్డి

-

రాచకొండ కమిషనరేట్ పరిధిలోతెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TSIIC)ద్వారా 2 కోట్ల 91 లక్షల    నిధులతో  ఎస్వైఆర్ కన్వెన్షన్ లో 284 సిసి కెమెరాలను జిల్లెలగూడ లో ప్రారంభించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి,మంత్రి సబితా ఇంద్రారెడ్డి.రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్ పేట్,బాలాపూర్,పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భం గా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ….మహేశ్వరం నియోజకవర్గములోనే 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ను అభినందించారు.

బడంగ్ పేట్ కార్పొరేషన్ లో 1 కోటి 20 లక్షలు సీసీ కెమెరాల కు,మీర్ పేట్ కార్పొరేషన్ లో 25 లక్షలు,జల్ పల్లి మునిసిపాలిటీ లో 50 లక్షలు బడ్జెట్ లో కేటాయించడం జరిగిందని మంత్రి గారు తెలిపారు..దేశంలో నే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ గా నిలిచింది అని అన్నారు.సీసీ కెమెరాల సాంకేతికతో రాష్ట్రంలో కేసులను 24 గంటల్లో ఛేదించటానికి అవకాశం ఏర్పడుతుంది అని cp మహేష్ భగవత్ తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి అన్ని రకాల సదుపాయాలు,సౌకర్యాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు.రాష్ట్రంలో 9 లక్షల 20 వేల సీసీ కెమెరాల ఏర్పాటు,ఇది దేశంలోని అన్ని రాష్టాల కన్నా ఎక్కువ అని అన్నారు.

రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అందులో పోలీస్ శాఖవే 18 వేల ఉద్యోగాలు ఉండటం గమనార్హం అన్నారు.కెమెరాను చూస్తేనే భయంతో క్రైమ్ చేయరు…. ఒక కెమెరా వంద మంది పోలీస్ లతో సమానం.నేరాల తీవ్రత తగ్గింది.రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక లక్ష 50 వేల సీసీ కెమెరాలు ఉంటే,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 లక్షల పై చిలుకు సీసీ కెమెరాలు ఉన్నాయని అన్నారు…ఈ కార్యక్రమంలో సీపీ మహేష్ భగవత్,తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,ఐపీఎస్ లు సుధీర్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news