తెలంగాణ మంత్రి పొంగులేటి అడ్డంగా మరోసారి బుక్కయ్యారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నోరు జారారు. మీడియా సమావేశంలో బనకచర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ పేరును బంకచర్లగా పలికారు. దీంతో ప్రతిపక్ష, విపక్ష నేతలు మంత్రి తీరుపై మండిపడుతున్నారు.

ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అటు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో నిన్న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి కేబినెట్ భేటీ కావడం గమనార్హం.
ఈ సందర్బంగా స్పోర్ట్స్ పాలసీని ఆమోదించిన తెలంగాణ కేబినెట్… కాళేశ్వరం కమిషన్కు మినిట్స్తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ కీలక తీసుకుంది.
అయ్యా మంత్రి పొంగులేటి గారు అది బంకచర్ల, డొంకచర్ల కాదు బనకచర్ల pic.twitter.com/B5F8oW2AKh
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2025