5 సార్లు తప్పించుకొని 6వ సారి బలైన సర్వేయర్

-

5 సార్లు తప్పించుకొని 6వ సారి సర్వేయర్ బలయ్యాడు. గద్వాల సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. భర్త బైక్ కి జీపీఎస్ ట్రాకర్ అమర్చి, సుపారీ గ్యాంగుకు లొకేషన్ తెలియజేసింది భార్య. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రియుడి కోసం భర్త తేజేశ్వర్ ను హతమార్చిన ఘటనలో దర్యాప్తు చేస్తూ సంచలన విషయాలు బయటపెట్టింది పోలీసులు. వివాహితుడైన బ్యాంకు మేనేజర్ కు పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను ఇంటికి తీసుకెళ్లి మనకు పిల్లలు లేరు కదా ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని తన భార్యకు చెప్పారు బ్యాంకు మేనేజర్, దింతో భార్య నిరాకరించింది.

Sensational details emerging in the Gadwal surveyor murder case
Sensational details emerging in the Gadwal surveyor murder case

ఇదే సమయంలో ఐశ్వర్య – తేజేశ్వర్ ల నిశ్చితార్థం కూడా రద్దవడంతో, ఫోన్ లో ఇద్దరితో ప్రేమాయణం నడిపించింది ఐశ్వర్య. ఐశ్వర్య మాయ మాటలు నమ్మి తన ఇంట్లో వాళ్లని ఎదురించి ఐశ్వర్యతో పెళ్లికి సిద్ధమయ్యాడు తేజేశ్వర్. తేజేశ్వర్ తో పెళ్లైనప్పటికీ బ్యాంకు మేనేజర్ తో సంబంధం కొనసాగిస్తూ, ఎలాగైనా తేజేశ్వర్ అడ్డు తొలగించుకొని నీ దగ్గరకి వచ్చేస్తానని బ్యాంకు మేనేజర్ కు తెలిపింది ఐశ్వర్య. దీంతో కొంతమందికి రూ.75 వేలు సుపారీ ఇచ్చి తేజేశ్వర్ హత్యకు పథకం వేసాడు బ్యాంకు మేనేజర్.

తేజేశ్వర్ బండికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి, అతని లొకేషన్ ను సుపారీ గ్యాంగుకు అందించింది ఐశ్వర్య. ఐదుసార్లు హత్యాప్రయత్నం నుండి తప్పించుకొని, ఆరోసారి హంతకులకు చిక్కింది తేజేశ్వర్. ప్రైవేటు సర్వేయర్ అవ్వడంతో సర్వే చేయాలని, తేజేశ్వర్ ను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు హంతకులు. ముందు సీటులో కూర్చున్న తేజేశ్వర్ ను కత్తితో గొంతుకోసి చంపి, మృతదేహాన్ని తాళ్లతో బంధించి, కవర్లో కట్టి, పాణ్యం సమీపంలో గాలేరి నగర కాల్వ వద్ద పడేసారూ హంతకులు.

Read more RELATED
Recommended to you

Latest news