ఆలయ భూములను అమ్మేస్తున్నా దొంగ బాబాపై గ్రామస్థుల ఫిర్యాదు..!

-

దేవాలయ భూములను ఆక్రమణల బారి నుండి కాపాడండి అని జగిత్యాల అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామస్తులు. అయితే సదరు తక్కలపల్లి గ్రామంలోని ఆక్రమణకు గురవుతున్న దేవాలయ 5 ఎకరాల భూమిని కాపాడాలని కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని భోగేశ్వరాలయం జగదీశ్వరాల ఆలయాలకు సుమారు 5 ఎకరాల స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని గ్రామస్థుల ఫిర్యాదు లో పేర్కొన్నారు.

అయితే తమ దేవాలయానికి ఓ దొంగ స్వామీజీ వచ్చి భూములను కబ్జా చేస్తున్నాడు అని.. వాటిని అమ్మేస్తున్నాడని గ్రామస్థులి ఫిర్యాదులో ఆరోపించారు. ఆ భూమి ఆక్రమించిన వ్యక్తిని ఇదేంటని ప్రశ్నిస్తే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దేవాలయ భూముల పరిరక్షణకు దేవాదాయ పురావస్తు శాఖలతో సమీక్షించి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్థులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news