బీజేపీ కోసం శ్రమించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు : ఈటల రాజేందర్

-

బీజేపీ కోసం శ్రమించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు మల్కాజ్ గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా..
శ్రీ నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలనే సంకల్పంతో మల్కాజిగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమించిన సహచర కార్యకర్తలకు, నాయకులకు, సోషల్ మీడియా వారియర్స్ మరియు వెల్లువలా సహకరించి, మమ్ము ఆశీర్వదించి, తమ ప్రేమాభిమానాలను ఓటు రూపంతో తెలియజేసిన వివిధ సంఘాల ప్రతినిధులకు, అభిమానులకు, ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ బీజేపీ కే పట్టం కట్టారని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉండటంతో తమకు చాలా సంతోషం కలిగిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version