అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి

-

రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుతాం. తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదు. బండ్లపైనే కాదు.. మా గుండెలపై కూడా TG రాసుకున్నాం. రాష్ట్రంలో రాచరిక పోకడలు ఉండకూడదన్నదే మా విధానం. ప్రతిపక్షాల విమర్శలు పిల్లిపెట్టే శాపనార్థాల్లా ఉన్నాయి. 100 రోజులు పూర్తి కాకముందే ఎందు ఈ శాపనార్థాలు అని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.

ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ అంటే ఓ భావోద్వేగం.. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల అణచివేతలు, అవమానాలు ఎదుర్కొన్నాం. తొమ్మిదేళ్లైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు వేయడానికి కొన్ని సార్లు 5 నెలలు, కొన్ని సార్లు 9 నెలలు ఇలా అధిక సమయం పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version