దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్

-

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని నిన్న ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి వరకు అమ్మవారి ఆలయంలో దాండియా ఆడి యువకులు వెల్లిపోయారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా శుక్రవారం ఉదయం వచ్చి చూసే వరకు విగ్రహం పూర్తిగా ధ్వంసమై ఉన్న విషయం తెలిసిందే. విగ్రహం చేతులు విరగ్గొట్టడం.. పూజా సామాన్లు చెల్లా చెరుదుగా పడేశారు. బారికేడ్లు సైతం తొలగించారు. దీంతో అందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. అసలు ఎవ్వరూ చేశారు.

దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కృష్ణయ్య గౌడ్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి ఆహారం కోసం దుర్గామాత దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆహారం కోసం వెతికినా ఏమీ దొరకకపోవడంతో కోపంతో మండపాన్ని చిందర వందర చేసి, దుర్గామాత చేయిని విరగ్గొట్టాడని పోలీసులు తెలిపారు. నిందితుడు కృష్ణయ్య గౌడ్‌ని అరెస్ట్ చేశారు  పోలీసులు.. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version