వరద నీటిలో చిక్కుకున్న లారీ డ్రైవర్, కూలీలను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు

-

మంగళవారం రోజు శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎగ్జిట్ నెంబర్ 15 అండర్ పాస్ వద్ద భారీ వర్షం పడడంతో వరద నీరు రోడ్డుపైకి వచ్చినందువలన సర్వీస్ రోడ్డును భారీకేడ్ల సహాయంతో మూసివేశారు. అయితే రాత్రిపూట ఎవరూ లేని సమయంలో ఒక లారీ డ్రైవర్ భారీకేడ్లను తీసుకొని ఆరోడ్డు మార్గాన వెళ్లడానికి ప్రయత్నించడంతో వరద నీటిలో ఆ లారీ మునిగిపోయింది. లారీ లో ఉన్న డ్రైవర్ మరియు ఇద్దరు కూలీలు టాప్ పై చిక్కుకుపోయారు.

 

సమాచారం అందుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఓఆర్ఆర్ పెట్రోల్ మొబైల్ 1 సిబ్బంది ధనరాజ్ గౌడ్, శివశంకర్ మరియు గణేష్ వారిని తాడు సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలలో, వరద నీటిలో లేదా పోలీసులు నిషేధించిన ప్రాంతాలలోకి ఎట్టి పరిస్థితులలోను వెళ్ళొద్దని సైబరాబాద్ పోలీసులు విన్నవిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version