గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కే రోడ్లు వేశారని చెప్పారు.
ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికీ సింగరేణి నిధులు కూడా వాడారని పేర్కొన్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా.. అని హరీశ్ రావు సవాల్ విసిరారు. కోమటి రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్అండ్బీ పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. రోడ్ల గురించి ఒక రోజు ప్రత్యేకంగా చర్చిద్దామని తెలిపారు.