రాహుల్ గాంధీ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్టు అయ్యారు. జపాన్లోని హిరోషిమా చారిత్రక నగరంలో నేను మీ లేఖను చదివానన్నారు రేవంత్. అదృష్టవశాత్తూ, నేను ఇక్కడ మహాత్మా గాంధీజీ విగ్రహం ఉన్న పవిత్ర స్థలాన్ని సందర్శించబోతున్నప్పుడు మీ లేఖ చదివాను… మీ స్ఫూర్తిదాయకమైన పిలుపు నాకు బలంగా తాకిందని చెప్పారు. గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో మీ ఆలోచనలు మరియు భావాల స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు సిఎం రేవంత్ రెడ్డి.

రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని లేఖలో కోరిన రాహుల్ గాంధీ.. బిఆర్ అంబెడ్కర్, రోహిత్ వేములలాగా లక్షలాది మంది ఎదుర్కొన్న కుల వివక్ష ఇకపై ఎవరు ఎదుర్కోవద్దన్నారు. కుల వివక్షపై, అంటరాని తనంపై సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను లేఖలో పేర్కొన్న రాహుల్.. దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్న పేర్కొన్నారు. అయితే ఈ మేరకు రాహుల్ గాంధీ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్టు అయ్యారు.