ఈ నెల 28న తెలంగాణ అమిత్‌ షా…షెడ్యూల్‌ ఇదే

-

కేంద్ర మంత్రి అమిత్ షా ఈనెల 28న తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ మండల అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో ఆయన సమావేశం అవుతారని చెప్పారు. అలాగే శంషాబాద్ లో నిర్వహించే సభకు అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం, బీఆర్ఎస్ స్వేదపత్రం రెండు అవినీతి పత్రాలేనని కిషన్ రెడ్డి విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం అటల్ బిహారీ వాజపేయి జయంతి నీ గుడ్ గవర్నెన్స్ డే గా పాటిస్తుందన్నారు. వాజపేయ్‌ విశిష్ట సేవలు దేశానికి అందించారని కొనియాడారు. మెజారిటీ లేకున్నా అద్భుతమైన పాలన ను అందించారన్నారు. ఒక ఓటు తక్కువ ఉంటే రాజీనామా చేసిన ఆదర్శ వ్యక్తి అటల్ అన్నారు. కోట్లాది ఇల్లు నిర్మించారు… ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కుగ్రామలకు రోడ్లు వేసిన ఘనత ఆయనదని చెప్పారు. పాకిస్తాన్ తోక జాడిస్తే యుద్ధం చేసిన గెలిచిన వ్యక్తి వాజ్ పాయ్ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version