ఇవాళ శ్రీచైతన్య స్కూళ్లు, కాలేజీలకు సెలవు

-

శ్రీ చైత‌న్య విద్యాసంస్థ‌ల అధినేత డాక్ట‌ర్ బీఎస్ రావు(75) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న బీఎస్ రావు గురువారం మ‌ధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఈ తరుణంలోనే… శ్రీ చైత‌న్య విద్యాసంస్థ‌ల అధినేత డాక్ట‌ర్ బీఎస్ రావు భౌతిక‌కాయాన్ని విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు.

కాగా.. శ్రీ చైత‌న్య విద్యాసంస్థ‌ల అధినేత డాక్ట‌ర్ బీఎస్ రావు మరణించిన నేపథ్యంలోనే… ఆయనకు సంతాపం తెలుపుతూ… ఇవాళ శ్రీచైతన్య స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది యాజమాన్యం.
కాగా, బీఎస్ రావు పూర్తి పేరు బొప్ప‌న స‌త్య‌నారాయ‌ణ రావు. బీఎస్ రావు దంప‌తులు ఇంగ్లండ్, ఇరాన్‌లో వైద్యులుగా సేవ‌లందించారు. అయితే.. డాక్టర్ బీఎస్ రావు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. విద్యా దార్శనికుడు, శ్రీచైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news