వైసీపీ నేతలపై నారా లోకేష్ పరువు నష్టం కేసు !

-

 

వైసీపీ నేతలపై నారా లోకేష్ న్యాయపోరాటానికి దిగారు. పరువు నష్టం కింద వైకాపా నేతలపై పెట్టిన క్రిమినల్ కేసుల్లో వాగ్మూలం నమోదుకు నేడు స్వయంగా న్యాయస్థానానికి హాజరుకానున్నారు నారా లోకేష్. తన పిన్ని ఉమామహేశ్వరి ఆత్మహత్యపై అసత్య ప్రచారం చేశారంటూ వైసీపీ సోష‌ల్ మీడియా కోఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డిపై పరువు నష్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు లోకేష్.

హెరిటేజ్ ద్వారా చంద్రబాబు కుటంబం సారా వ్యాపారం చేస్తోందన్న ఎమ్మెల్సీ పోతుల సునీతపైనా మంగళగిరి కోర్టులో కేసు పెట్టారు లోకేష్. గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి, పోతుల సునీత‌ల‌పై దాఖ‌లు చేసిన కేసుల్లో ఐపిసి సెక్షన్ 499, 500 ప్రకారం క‌ఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు లోకేష్. పిటిష‌న‌ర్ అయిన లోకేష్ వాంగ్మూలాన్ని నేడు న‌మోదు చేయ‌నుంది మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ కోర్టు. ఇక రేపటి నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news