తెలంగాణలో విషాదం..గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడి మృతి

-

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అసలు వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం జరిగింది. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు చనిపోయాడు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి సుశాంత్ ముస్తాబాద్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.

Tragedy in Telangana 13-year-old boy died of heart attack

క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చిన అతడు నిన్న చాతిలో నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. సిరిసిల్లాలో ప్రాథమిక చికిత్స చేస్తుండగానే సుశాంత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక చిన్న వయస్సు లోనే హార్ట్ స్ట్రోక్ రావడం పై గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, తాళ్లపల్లి శంకర్-సరిత దంపతులకు ఇద్దరు. కుమారులు జశ్వంత్, సుశాంత్ (13) ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version