కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదంలో పైలట్ మృతి

-

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగురోడ్డు పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో శిక్షణలో ఉన్న పైలట్ శ్రీకరన్ రెడ్డి 26 సం ” లు అక్కడిక్కడే మృతి చెందాడు. కీసర నుండి ఘట్కేసర్ వైపు వెళ్తున్న i10 కార్ TS 08 FV 2468 , కారు లో ఉన్న శ్రీకారన్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు శ్రీకరన్ రెడ్డి స్వస్థలం గజ్వేల్ వాసిగా గుర్తించారు పోలీసులు.

Trainee pilot dies in road accident

అయితే… నేరెడ్ మీట్ ప్రాంతం లో మృతుడి కుటుంబం స్థిరపడిందని సమాచారం. బ్యాంకాక్ లో శిక్షణ పొందుతున్న పైలట్ శ్రీకారన్ రెడ్డి , గత వారం రోజుల క్రితం తన ఇంటికి రావడం జరిగిందని తెలిపారు కుటుంబ సభ్యులు. యాదగిరి గుట్ట కు వెళ్లి వస్తా అని ఇంట్లో చెప్పి తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయలుదేరాడు శ్రీకారన్ రెడ్డి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గురైన కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఇక ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version