ఇక నుంచి దండుమల్కాపూర్ నాది.. దత్తత తీసుకుంటున్నా: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-

మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక ప్రచారం గడువు సమీపిస్తున్న కొద్ది టీఆర్ఎస్ జోష్ పెంచింది. నియోజకవర్గ అభివృద్ధికి తామేం చేస్తామో చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇందులో భాగంగానే మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తాజాగా దండుమల్కాపూర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నానని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, దండుమల్కాపూర్ టీఆర్ఎస్ ఎన్నికల ఇంఛార్జి జీవన్ రెడ్డి ప్రకటించారు.

దండుమల్కాపూర్ లో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. దండుమల్కాపూర్ గ్రామాన్ని నూటికి నూరు శాతం అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానని జీవన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని మైసమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక.. డబ్బు సంపాదన తప్ప ఏనాడు ప్రజలను పట్టించుకోని ఒక కాంట్రాక్టర్ కు, నిత్యం ప్రజల మధ్యే ఉండే క్యారెక్టర్ ఉన్న నేతకు మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version