బీజేపీ నుంచి ఈటల ఒక్కడే పోరాటం చేస్తున్నాడు – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

-

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాక్యలు చేశారు. బీజేపీ నుంచి ఈటల ఒక్కడే పోరాటం చేస్తున్నాడన్నారు. హైడ్రా భాదితులకు అండగా బీజేపీ నుండి ఈటల రాజేందర్ మాత్రమే మాట్లాడుతున్నారని కొనియాడారు. హైడ్రా పేరుతో మూడు నెలల నుండి హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు,ఎంపీలు, కార్పోరేటర్స్ తో అఖిలపక్షం పెట్టాలని సీఎంను కోరామని… అఖిలపక్షం సమావేశాన్ని పెడతామని సీఎం చెప్పడాన్ని స్వాగతుస్తున్నామని పేర్కొన్నారు. అఖిలపక్షం ఎప్పుడో పెట్టి వుంటే బుచ్చమ్మ చనిపోయేది కాదన్నారు.

హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం బయటపెట్టాలని… నల్లచెరువులో బిఆర్ఎస్ నేతల ఆక్రమణలు ఉన్నాయని సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఫైర్ అయ్యారు. ఎవరు ఆక్రమణలు చేశారో సీఎం నివేదికలు తెప్పించుకోవాలని కోరారు. నల్ల చెరువు చుట్టూ బిఆర్ఎస్ హయాంలో కట్ట కట్టామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ మాత్రమేనని.. హైదరాబాద్ ప్రజలను వేధించవద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version