మాజీ ఎంపీటీసీ కేసులో ట్విస్ట్..కారుతో సహా పూడ్చిపెట్టిన హంతకులు…!

-

హైదరాబాద్ శివారులో మాజీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యారు. ఘట్కేసర్ PS పరిధిలో ఉండే మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదని ఆయన సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధం కారణంగా మాజీ ఎంపీటీసీ మహేష్‌ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Brutal muder of former MPTC in Hyderabad suburbs

అయితే… తాజాగా ఈ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గడ్డం మహేష్ ను కారుతో సహా పూడ్చిపెట్టారట హంతకులు. డంప్ యార్డ్ లో JCB తో పెద్ద గొయ్యి తవ్వి… కారులో గడ్డం మహేష్ మృతదేహాన్ని ఉంచి కారుతో సహా పూడ్చి పెట్టారట హంతకులు. దీంతో మాజీ ఎంపీటీసీ మహేష్‌ మృత దేహాన్ని JCB తో వెలికితీస్తున్నారు పోలీసులు. అలాగే, మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్యకేసులో పురోగతి లభించడంతో… మహేష్ ను కిడ్నాప్ చేసి చంపిన ఆరుగురు నిందితుల అరెస్ట్ అయ్యారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version