MBA విద్యార్థి సాహితి ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్‌ నేత ?

-

దిల్ సుఖ్ నగర్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఓ ప్రయివేటు ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ ఎంబీఏ చదువుతున్న సాహితి అనే యువతి మరణించింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ఎంబీఏ చదువుతున్న ములుగు జిల్లాకు చెందిన సాహితీ(26) హాస్టల్‌ రూమ్‌లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.

Twist in MBA student Sahithi issue

దీంతో యువతి మృతిపై చైతన్య పురి పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని… పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అయితే.. ఈ కేసులో సంచలన విషయం బయటకు వచ్చింది. కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపులు తాళలేకే సాహితి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.

నిన్న ఉమెన్స్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న సాహితి స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉలుబాక గ్రామంగా గుర్తించారు పోలీసులు. వెంకటాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ నేత చిడెం మోహన్ రావు కుమారుడు హరీష్ గత వాట్సాప్‌లో కొన్ని వందల మెసేజెస్ పంపుతూ కొంత కాలంగా సాహితిని వేధిస్తున్నాడట. అయితే.. ఆ వేధింపులు తాళలేక..సాహితి అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news