మేడ్చల్ జిల్లాలో కిరాతకం.. ఇద్దరి గొంతు కోసిన అగంతకులు

-

మేడ్చల్ జిల్లాలో కిరాతక ఘటన వెలుగుచూసింది. గుర్తు తెలియని అగంతకులు ఇద్దరి గొంతు కోసిన భయానక ఘటన మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కిష్టాపూర్ గ్రామంలో బీహార్‌కు చెందిన పవన్ కుమార్‌, సంతోష్ తమకు తోచిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ ఇద్దరిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి పరారైనట్లు సమాచారం.

అయితే, వారి గది తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు లోనికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇద్దరిలో సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.దోపిడీ చేసే క్రమంలో ఎవరైనా ఇలా చేసి ఉంటారా? లేక పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version