TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్..

-

TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్ అయ్యారు. ఎఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్ చేసి..డీల్ కుదుర్చుకొని పరీక్ష రాసింది సాహితీ అనే యువతి. ఈ తరుణంలోనే.. కరీంనగర్ కు చెందిన మద్దెల శ్రీనివాస్, కుమార్తె సాహితీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కూతురు కోసం తండ్రి శ్రీనివాస్ డిఈ పూల రమేష్ తో డీల్ కుదుర్చుకున్నాడు.

ఆర్థిక లావాదేవీల్లో ట్రాన్సక్షన్ జరిపిన శ్రీనివాస్..ఈ లావాదేవీలను గుర్తించింది సిట్ బృందం. దీంతో.. మద్దెల శ్రీనివాస్, కుమార్తె సాహితీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇప్పటివరకు ఈ కేసులో 80 మంది అరెస్ట్ అయ్యారు. మరిన్ని అరెస్టులుండే అవకాశం ఉందని.. డిఈ రమేష్ వ్యవహారాలు, కాల్ డేటా, ఆర్థిక లావాదేవీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని సిట్ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news