ఉత్తమ్ కుమార్ మాట తీరు మూసీ ప్రవాహమే.. హరీశ్ రావు ఫైర్..!

-

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకాయిట్ అంటూ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ గత పదేండ్లలో ప్రాజెక్టులను లూటీ చేశారని పేర్కొన్నారు. అలాగే కట్టిన ప్రతీ ప్రాజెక్ట్ లో వేల కోట్ల స్కామ్ కు పాల్పడి.. జేబులు నింపుకున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని.. 2026 మార్చి వరకు దేవాదుల ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు హరీశ్ రావు తాజాగా కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమన్నారు. అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడంలో సీఎం రేవంత్ రెడ్డికి నేనేమి తక్కువ కాదని నిరూపించాలని అనుకుంటున్నావా.. ఉత్తమ్ అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట తీరు మూసీ ప్రవాహం అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నోటి పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ నోటిని కూడా ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version