తెలంగాణ రేషన్ షాపుల్లో సన్న బియ్యం… ఎప్పటినుంచంటే ?

-

తెలంగాణ రేషన్ కార్డుదారులకు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది. తాజాగా రేషన్ షాపుల్లో… సన్న బియ్యం ఇవ్వడం పైన కీలక ప్రకటన వచ్చింది. కొత్త సంవత్సరం అంటే జనవరి మాసం నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని తాజాగా ప్రకటన విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున… సన్న బియ్యం ఇస్తామని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల లెక్కల ప్రకారమే… సన్న బియ్యం పంపిణీ కూడా ఉంటుందని ఆయన వివరించారు. సన్న బియ్యం పంపిణీ కోసం దాదాపు 20 వేల కోట్లు… ఖర్చవుతున్నాయని కూడా ఆయన వివరించారు. లబ్ధిదారులకు అందరికీ… సన్న బియ్యం అందిస్తామని ప్రకటించారు ఉత్తంకుమార్ రెడ్డి. ఈ విషయంలో ఎవరికీ అన్యాయం జరగదని కూడా తెలిపారు. తెలంగాణ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రకటనతో రేషన్ కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news