బీఆర్ఎస్​లో చేరేందుకు.. కేసీఆర్​తో వివిధ రాష్ట్రాల నేతల భేటీ

-

బీఆర్ఎస్​లో చేరేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైదరాబాద్ ప్రగతి భవన్ లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ కు చెందిన పలువురు నేతలు కలిశారు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్,.. మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, ఛత్తీస్‌గడ్‌ మాజీ మంత్రి చబ్బీలాల్ రాత్రే,.. గడ్చిరోలి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పసుల సమ్మయ్య, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్.. సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు,.. ఆసరా పింఛన్లు తదితర పథకాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి ఇతర కార్యక్రమాల వివరాలను.. ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని నాయకులు ఆహ్వానించారు. దేశంలో కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం ప్రస్తుతం అవసరం ఉందన్నారు. పార్టీ విధివిధానాలపై వివిధ రాష్ట్రాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారు బీఆర్ఎస్​లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news